దుండిగల్, జూలై 8 : దుండిగల్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట, శంభీపూర్లోని పలు వార్డుల్లో రూ.2.71 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణతో కలిసి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 22వ వార్డులో రూ.20 లక్షలతో సీసీ, బీటీ రోడ్డు, 21వ వార్డులో రూ. 10 లక్షలతో, 22వ వార్డులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, 23వ వార్డులో రూ.10 లక్షలతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి, మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, 24వ వార్డులో రూ. 52.5 లక్షల నిధులతో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, 25వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.42 లక్షలతో ఫంక్షన్హాల్ నిర్మాణం, 26వ వార్డులో రూ.32 లక్షలతో ఓపెన్ జిమ్, సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, రూ. 30 లక్షలతో శంభీపూర్ సాకిన్చెరువు వద్ద శ్మశాన వాటిక అభివృ ద్ధి, రూ.50 లక్షలతో వర్షపునీటి నాలా పైపులైన్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులు వెచ్చిం చి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఉమ్మడి ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో చేసి చూపుతున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ భోగీశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, లక్ష్మీఆంజనేయులు, మాదాసు వెంకటేశం, అర్కల అనంతస్వామి, సంధ్యహన్మంతరావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, నేతలు అమర్నాథ్, నర్సింహా, మంజుల, శ్రీహరి, రమేశ్, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్, జూలై 8 : దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 10 డివిజన్లోని ఎల్లమ్మ నాగదేవత దేవాలయం వద్ద కార్పొరేటర్ మేకల వెంకటేశం తనసొంత ఖర్చులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం కమ్యూనిటీ హాల్ను నిర్మించిన కార్పొరేటర్ మేకల వెంకటేశంను ఎమ్మెల్యే, మేయర్ సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగరాజుయాదవ్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపాల్రెడ్డి, చందు, నాగేశ్ పాల్గొన్నారు.
గాజులరామారం, జూలై 8 : ఆలయాలు మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శ నగర్లోని అయ్యప్ప స్వామి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వారి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, నాయకులు కస్తూరి బాల్రాజు, పర్శ శ్రీనివాస్యాదవ్, మురళీ, చెట్ల వెంకటేశ్, గురుస్వామి సాయి పాల్గొన్నారు.