మల్కాజిగిరి : ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం మల్లికార్జున నగర్కు చెందిన దినేష్కుమార్, సాయి వైష్ణవి లు భార్యభర్తలు. 2018లో వీరికి వివాహం జరిగింది. అయితే ఆగస్టు 27న సాయి వైష్ణవి తనకు ఆరోగ్యం బాగాలేదని తాను తల్లి గారింటికి వెళతానంటే భర్త పంపించాడు.
కాగా ఆరోజు నుంచి ఆమె ఫోన్ పనిచేయకపోగా అత్తవారింటికి ఫోన్చేసి ఆరా తీయగా మా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో భర్త దినేష్కుమార్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.