చెన్నై: ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ మంగళవారం తెలిపింది. ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్గా కిరణ్ కొనసాగుతున్నారు.
‘మోరేకు మోర్కు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్, కిరణ్ మోరేకు బీసీసీఐ హెల్త్ గైడ్లైన్స్ పాటిస్తున్నాం. బీసీసీఐ ప్రొటోకాల్స్కు కట్టుబడి ఉన్నాం. ముంబై మెడికల్ టీమ్ కిరణ్ మోరే ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మా టీమ్ అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నట్లు’ ముంబై ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.