హైదరాబాద్ : ఈ నెల 9న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. కాగా, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాలను పునః సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇటీవల లేఖరాసింది.
కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ఈ నెల 20 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే సమావేశాల ఎజెండాలో చేర్చారని, తెలంగాణ అభ్యంతరాలను విస్మరించారని ఆక్షేపించారు. 2019 ఫిబ్రవరి 14న, ఈ నెల 2న తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖల్లోని అంశాలను సమావేశాల ఎజెండాలో చేర్చలేదని పేర్కొన్నారు.
వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో తమ సాగునీటిశాఖ అధికారులు, సాంకేతిక బృందం ఆ పనుల్లో తీరికలేకుండా ఉన్నారని, అందువల్ల పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని 20వ తేదీ తర్వాత రెండు రాష్ర్టాలకు అనుకూలమైన తేదీన నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తిచేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలోని కీలకాంశాలు