ముంబై : ఇద్దరు పిల్లలతో పాటు మహిళ మోతాదు మించి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ఏడాది కిందట భర్తతో విడిపోయిన మహిళ (46) నగరంలోని మిరా రోడ్డులోని జుహి నరేంద్ర బిల్డింగ్లో తన తండ్రితో కలిసి ఉంటోంది. మహిళకు ఒక కొడుకు (13) కుమార్తె (21) ఉన్నారు. పిల్లలు కూల్డ్రింక్ బాటిల్ కోసం గొడవకు దిగడంతో మనస్ధాపానికి గురైన మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
పిల్లలు ఘర్షణ పడగా కుటుంబ సభ్యులు సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అందరూ నిద్రకు ఉపక్రమించగా తెల్లారి మహిళ తండ్రి నిద్రలేచి చూడగా ఇంటిలో ముగ్గురు విగతజీవులుగా పడిఉండటంతో ఆయన షాక్కు గురయ్యారు. ఘటనా స్ధలాన్ని సందర్శించిన పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం దవాఖానకు తరలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళ తండ్రి షాక్లో ఉన్నాడని ఆయన తేరుకున్నాక ఇంటరాగేషన్ చేపడతామని పోలీసులు తెలిపారు. పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని అందుకే నిద్ర మాత్రలు వాడుతున్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.