పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం జల్పల్లిలో నివాసముంటున్న శిరీష (29) గృహిణి. 5న రాత్రి 10 గంటల సమయంలో తల్లి ఇంట్లో కనిపించడం లేదని ఆమె కుమారుడు ప్రవీణ్ తన తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు.
అనంతరం శిరీష కోసం పలు చోట్ల వెతికినా ఆచూకి లభించలేదు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.