చిట్యాల/జయశంకర్ భూపాలపల్లి : ఇంట్లో బట్టలు ఆరవే స్తుండగా దండెం తీగకు ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకరస సంఘటన మంగళవారం చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామ శివారు రామచంద్రాపూర్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన సిరిపురం సరోజన (65) మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా.. బట్టలు ఆరేయడానికి ఉన్న దండెం తీగకు కరెంట్ షాక్ పాస్ అవడంతో కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త కొమురయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత