హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఆర్ట్ ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ ఈ మంటల్లో హౌస్ కీపర్ యశోద(40) సజీవదహనం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ల్యాబ్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, కార్మికులు విషాదంలో మునిగిపోయారు.