కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: 100 గ్రా., మెంతి ఆకు: ఒక కప్పు, శనగపిండి: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్: పావు టీ స్పూన్, ఉల్లిపాయ: ఒకటి, కారం: ఒక టీ స్పూన్, ధనియాల పొడి: ఒక టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్ను బాగా కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర, మష్రూమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్మీద నూనె పెట్టి మిశ్రమాన్ని పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే సరి. వేడివేడి మష్రూమ్ మెంతి పకోడి రెడీ.