అమరావతి : కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు చిన్నారులతో సహా వ్యవసాయ బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం జగన్నాథ వలస గ్రామంలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భోగేశ్వరి (27) తన ఐదేండ్లలోపు ముగ్గురు పిల్లలు చక్రి (5), జయలక్ష్మి (3), భరత్ (2) కలిసి బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.