జహీరాబాద్ : మానవీయ సంబంధాలను పటిష్టం చేసే అపూర్వ వేడుక రక్షా బంధన్. అలాంటి పండగ రోజే జహీరాబాద్లో విషాద ఘటన జరిగింది. అన్న తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపంలో ఉరేసుకొని చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లా కేంద్రంలోని మాణిక్ప్రభు కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. మాణిక్ప్రభు కాలనీకి చెందిన మమత (20) ఇవాళ మధ్యాహ్నం తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లగా అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో మమత ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణం చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.