హపూర్ : యాపీలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. హపూర్ జిల్లాలోని రసూల్పూర్ గ్రామంలో మహిళ తన ఏడాదిన్నర వయసున్న కుమారుడి గొంతునులిమి చంపి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన విపిన్ భార్య గురువారం ఆమె గది కిటికీ గ్రిల్కు వేలాడుతూ కనిపించింది.
కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా ఆమె ఏడాదిన్నర కుమారుడు మంచంపై విగతజీవిగా పడిఉన్నాడు. స్ధానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. బాధితురాలి భర్త విపిన్ వేరే పని నిమిత్తం లక్నోలో ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఘటన అనుమానాస్పదంగా ఉందని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.