మహబూబ్నగర్: జిల్లాలోని బాలానగర్ (Balanagar) మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని చిన్నరేపల్లిలో భర్తను హత్యచేసిందో భార్య. చిన్నరేపల్లికి చెందిన భాగ్యమ్మ, రవీంద్రగౌడ్ భార్యాభర్తలు. గతకొంత కాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరు తగాదా పెట్టుకున్నారు. ఈ క్రమంలో రవీంద్రగౌడ్ను భాగ్యమ్మ కొట్టి చంపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే భర్తను చంపిందని స్థానికులు తెలిపారు.