హైదరాబాద్: భాగ్యనగరంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఒక ఇల్లాలు కట్టుకున్న భర్త ఉసురు తీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో వెలుగు చూసింది. రెండ్రోజుల క్రితం గోపన్పల్లి తండాకు చెందిన శంకర్ (30) హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈ క్రమంలో శంకర్ను అతని భార్య జ్యోతి చంపించినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు చెప్పారు. ఆమెకు మాణిక్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితో సాయంతోనే భర్తను చంపించిందని తేల్చారు. నిందితులు జ్యోతి, మాణిక్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.