గద్వాల్ : కట్టుకున్న భర్తనే భార్య గొంతు నులిమి హత్య చేసిన సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి (26)కు జిల్లా కేంద్రంలోని నల్లకుంటకు చెందిన వెంకటేష్ తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.
అయితే భర్త వెంకటేష్ సోమవారం తెల్లవారుజామున భార్య గొంతు నులిమి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలు పుట్టారని తమ బిడ్డను చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.