హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. వస్తువుల కొనుగోలు, విక్రయాల పేరుతో అమాయకుల డబ్బు దోచుకుంటున్నారు. సెల్ ఫోన్కు లింక్ పంపించి మోసాలకు పాల్పడేవారు ఇప్పుడు క్యూఆర్ కోడ్ పంపి నిండా ముంచుతున్నారు. తాజాగా ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఈ తరహాగానగదు మాయం చేసిన ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..బాగ్అంబర్పేట శ్రీనివాసకాలనీకి చెందిన రమేష్ కుమారుడు అక్షయ్ (20) బీటెక్ చదువుతున్నాడు. కాగా, గత సోమవారం తన ఇంట్లో ఉన్న సోఫా సెట్ను ఓలెక్స్ సైట్లో అమ్మకానికి ఉంచాడు. అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లోపే ఓ గుర్తు తెలియని నంబరు నుంచి సెల్ ఫోన్కు కాల్ చేశాడు. తాను నాంపల్లి నుంచి మాట్లాడుతున్నానని సోఫా సెట్ కొనుగోలు కోసం డబ్బలు చెల్లించడానికి క్యూఆర్కోడ్ పంపిస్తున్నామని అది స్కాన్ చేయాలని కోరాడు.
ఇది నిజమని నమ్మి వెంటనే తన ఫోన్కు వచ్చిన క్యూఆర్కోడ్ను స్కాన్ చేయగానే..అక్షయ్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.63వేల నగదు మాయమైంది. నగదు డ్రా చేసుకున్నట్లు ఫోన్లో వచ్చిన మెసేజ్ను గుర్తించిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Alcohol : మద్యం తాగొద్దన్న కూతురు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తల్లి
Job news : ఇన్కాయిస్లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి