జనగామ : జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నర్మెట్ట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం జోరుగా అకాల వర్షం కురిసింది. దీంతో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలో బస్తాలు, రాశులు, ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.
పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం పండించిన పంట కండ్లముందే నీళ్ల పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఆపద వేళ ఎమ్మెల్యే సుమన్ ఆపన్న హస్తం
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు