మహబూబాబాద్ : చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మత్స్యకారుడు పులుగుజ్జు వెంకన్న(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నీటమునిగి మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. వెంకన్న మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్