సత్తుపల్లి, జూలై 9 : పలు పంచాయతీల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. కిష్టారం, రామగోవిందాపురం పంచాయతీల్లో సర్పంచ్లు శెట్టిమాల రేణుకా ఈశ్వర్, బేతిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామాల్లోని సైడ్డ్రైన్లలో శుక్రవారం పూడిక తీయించి బ్లీచింగ్ చల్లించారు. హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు రవి, నిరోష, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, జూలై 9 : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా రవాణాధికారి (డీసీవో) పిలుపునిచ్చారు. మండలపరిధిలోని బోర్డరు చెక్పోస్టు వద్ద మొక్క నాటి మాట్లాడారు. వనాలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. ఆయన వెంట ఎంవీఐలు వెంకటపుల్లయ్య, వరప్రసాద్, మనోహర్, ఏవో జావెద్ అలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కల్లూరు, జూలై 9 : పల్లె ప్రగతిలో భాగంగా కప్పలబంధంలో సర్పంచ్ నందిగామ ప్రసాద్ ఆధ్వర్యంలో దళితవాడలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో శాస్త్రి, ఉపాధిహామీ జేఈ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో సైడ్డ్రైన్ పూడికతీత, పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.
కారేపల్లి, జూలై 9 : కారేపల్లి, అప్పాయిగూడెంలో సర్పంచ్లు ఆదెర్ల స్రవంతి, అజ్మీర అరుణ శుక్రవారం పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కారేపల్లిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, ప్రత్యేకాధికారులు పుష్పకుమారి, చైతన్య, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, జూలై 9 : పంచాయతీల్లో పల్లెప్రగతి పనులు శుక్రవారం జోరుగా సాగాయి. మద్దులపల్లి సర్పంచ్ పులసం జయమ్మ ఆధ్వర్వంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్క్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుగులోత్ గబ్రూనాయక్, ఎంపీడీవో సీలార్సాహెబ్, ఎంపీవో సత్యనారాయణ, ఏపీవో శ్రీవాణీ, ఉప సర్పంచ్ అంబటి శ్రీనివాసరెడ్డి, సామా మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, జూలై 9 : డ్రైడేలో భాగంగా మర్లపాడు సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి గ్రామంలోని శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ ఇళ్లల్లో నిల్వ నీటిని, బురదగుంటలలో నీటిని తొలగించడం, ఇళ్ల చుట్టూ ఉ చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీడీవో రంజిత్కుమార్ గురువారం రాత్రి లింగపాలెం ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో లింగపాలెం సర్పంచ్ సింగపోగు పద్మ, ఉపసర్పంచ్ యర్రా రమేశ్, కార్యదర్శులు సురేశ్రెడ్డి, పద్మ పాల్గొన్నారు.
వైరా, జూలై 9: మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. 13వ వార్డులో వైరా మున్సిపల్ వైస్చైర్మన్ ముళ్లపాటి సీతారాములు పాల్గొని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
కారేపల్లి రూరల్, జూలై 9 : అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా చేపట్టారు. పోలంపల్లి గ్రామంలో జడ్పీటీసీ వాంకుడోతు జగన్, ఎంపీడీవో రమాదేవి, ఏపీవో రంగనాయకమ్మ, సర్పంచ్ సక్రు నాయక్ పల్లె ప్రగతి పనులను శుక్రవారం పరిశీలించి మొక్క నాటారు. జడ్పీటీసీ జగన్ మాట్లాడుతూ…హరితహారంలో అందరూ భాగస్వాములై నాటిన ప్రతి ఒక్క మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కొణిజర్ల, జూలై 9 : పెద్దమునగాలలో నిర్వహిస్తున్న ప్రగతి పనులను డీఆర్డీవో పీడీ విద్యాచందన, ఏపీడీ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరికపల్లి శ్రీను, ఎంపీడీవో ఆర్.రమాదేవి, స్థానికులు పాల్గొన్నారు.
కొణిజర్ల, జూలై 9 : అమ్మపాలెంలో పల్లె ప్రగతి పనులను జడ్పీటీసీ పోట్ల కవిత శుక్రవారం పరిశీలించారు. డంపింగ్యార్డులో మొక్క నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుకూరి నాగేంద్రమ్మ, ఎంపీటీసీ బానోతు అనూష, గ్రామ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఉమా, వార్డుసభ్యులు కోసూరి భద్రమ్మ, కోసూరి శ్రీను, భోజ్యా, టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, కిలారు మాధవరావు, ఎస్.కే.ఖాదర్బాబు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, జూలై 9 : పల్లె ప్రగతితో గ్రామాల ముఖచిత్రాలు మారాలని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. బాసిత్నగర్లో గురువారం రాత్రి మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పల్లెనిద్ర చేశారు. శుక్రవారం గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పల్లె ప్రగతిపై అధికారులు, సర్పంచ్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీపీ బానోత్ సునీత, సర్పంచ్ ధారావత్ బాలునాయక్, ఎంపీడీవో సీలార్సాహెబ్, ఎంపీవో సత్యనారాయణ, ప్రత్యేకాధికారి బొలేషా పాల్గొన్నారు.
ఏన్కూరు, జూలై 9: పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం జన్నారం, గార్లఒడ్డు పంచాయతీల్లో ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, జడ్పీటీసీ బాదావత్ బుజ్జిలు ఫ్రైడే – డ్రైడే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. ఎంపీడీవో అశోక్, సర్పంచ్లు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ వనాల పెంపునకు కృషి చేయాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మేడా ధర్మారావు అన్నారు. శుక్రవారం తిమ్మారావుపేటలో మొక్కలు నాటి మాటాడారు.