కాచిగూడ : సెక్యూరిటీగార్డు తన విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండగా డీసీఎం వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ రత్నానగర్ ప్రాంతానికి చెందిన వెంకట్రావు కుమారుడు శ్రీను (30) వృత్తిరిత్యా కాచిగూడ టిఎక్స్ దవాఖానలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండగా మార్గ మధ్య కాచిగూడ చౌరస్తాలో డీసీఎం వాహనం ఢీకొనడంతో శ్రీను తలకు, ఎడమ చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. భార్య లావణ్య కాచిగూడ పోలీసులకు పిర్యాదు చేసింది. గాయాలకు కారణమైన వ్యక్తిపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.