జోగులాంబ గద్వాల : మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐజ మండలంలోని ఎంవీ ఫౌండేషన్ పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై స్కూల్ వాచ్ మెన్ కర్రెన్న అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ కుమార్ విచారణ జరిపారు.
విచారణ అనంతరం జడ్జి తీర్పు వెల్లడించగా లైంగిక దాడికి పాల్పడిన వాచ్ మెన్కు 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మూడువేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షఫీ ఉల్లా తెలిపారు. 2017లో మైనర్ పై లైంగిక దాడి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతినగర్ సీఐ వెంకటేశ్వరరావు విచారణ అధికారిగా వ్యవహరించి వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను కూల్చేయండి : సుప్రీంకోర్టు