Crime
- Jan 10, 2021 , 11:59:45
కేపీహెచ్బీ కాలనీలో లిఫ్టు గుంతలో పడి వాచ్మెన్ మృతి

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో దుర్ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి కాపలాగా ఉన్న వాచ్మెన్ లిఫ్టు గుంతలో పడి మృతిచెందారు. వాసంశెట్టి త్రిమూర్తులు అనే వ్యక్తి కూకట్పల్లి హౌసింగ్బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలోని ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-2లో ఉన్న ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. భవనం మెట్లు ఎక్కిదిగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలోపడి పోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- బిగ్బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం
- 2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
MOST READ
TRENDING