కరీమాబాద్ : కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తల్లీ కనిపించకుండా పోయిన సంఘటన మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీనగర్కు చెందిన గూల్ల సాది, రాధిక దంపతులు. వీరికి ఒక కూతురు గూల్ల హర్షిత ఉంది. ఈ నెల 14న దంపతుల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాగా భార్య రాధిక పనికి వెళ్లి వస్తానని చెప్పి కూతురుతో సహ వెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో చుట్టు పక్కల వారు, బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.