నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్లో ట్రస్టు ఏర్పాటు చేసి భక్తి ముసుగులో మోసం చేస్తున్న బురిడి బాబా విశ్వ చైతన్యస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయనత పాటు మరో ముగ్గురు శిష్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్ ట్రస్టు పేరిట విశ్వ చైతన్యస్వామి మోసాలు పాల్పడ్డాడు. ఓ భక్తురాలి ఫిర్యాదుతో విశ్వచైతన్య స్వామి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు విశ్వచైతన్య ట్రస్టుపై రైడ్ చేశారు. నిందితుల నుంచి రూ.26 లక్షలు, 500 గ్రాముల బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, 7 ల్యాప్ట్యాప్లు, 4 సెల్ఫోన్లు, కారు, మూలికలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వచైతన్య స్వామికి 40 దేశాల్లో భక్తులు ఉన్నట్లుగా నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇతడికి 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు వస్తాయని మహిళలను నమ్మించేవాడన్నారు. మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేసేవాడు. రెండో భార్య సుజితపై రూ.1.30 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.