బషీరాబాద్ : రైలు కింద పడి ఇద్దరు మృతి చెందిన రెండు ఘటనలు నవాంద్గి రైల్వే స్టేషన్లో పరిధిలో జరిగాయి. గురువారం రైల్వే కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన బీమప్ప(61) వీఆర్ఏ బుధవారం రాత్రి రైల్వే పట్టాల సమీపంలో ఉన్న సొంత పొలానికి అడవి పందుల కాపలాకు వెళ్లాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇర్ఫాన్ రైలులో ప్రయాణిస్తూ నవాంద్గి రైల్వే స్టేషన్లో జారి పడటంతో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడిని వైద్యం నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు కానిస్టేబుల్ తెలిపాడు.