తాండూరు రూరల్ : ప్రేమించిన యువతి దక్కకపోవడంతో పాటు అమ్మాయి బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం, గుంతబాసుపల్లి గ్రామానికి చెందిన సంతోష్కుమార్ (23), బంధువుల అమ్మాయి (సంధ్య)ని ప్రేమించాడు. నాలుగు రోజుల క్రితం ఇద్దరు కలిసి హైదరాబాద్కు వెళ్లి పెళ్లి చేసుకుని ఆదివారం తాండూరు పోలీస్ స్టేషన్కు వచ్చారు. అమ్మాయి మైనర్ అని తల్లి దేవమ్మ పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవ్వరీ ఇండ్లకు వారు వెళ్లి పోవాలని సూచించారు.
దేవమ్మ కూతురు సంధ్య ఆ రోజు రాత్రి నుంచి ఇంట్లో నుంచి వెల్లిపోయింది. నా కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి శాంత్కుమారే కారణమంటూ దేవమ్మ, సొదరుడు శేఖర్కు సమాచారం ఇచ్చింది. దీంతో దేవమ్మతోపాటు శేఖర్లు కలిసి గ్రామ ఉప సర్పంచ్ ఖైరత్ అలీ సమక్షంలో పంచాయతీ పెట్టారు. దేవమ్మ కూతురు సంధ్య కనబడకపోతే తనను ఏమైనా చెస్తారనే భయంతో శాంత్కుమార్ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శాంత్కుమార్ చెట్టుకు ఉరేసుకునే ముందు సెల్పీ వీడియో తీసుకున్నాడు. అమ్మాయి ఎక్కడికి వెల్లిందో తనకు తెలియదని వీడియోలో వివరించాడు.