మోమిన్పేట : శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామం. చేవెళ్లలో విధులు నిర్వహించేవారు. శనివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ జిల్లా కార్యాలయానికి వచ్చారు. డ్యూటీ ముగియడంతో రిలీవర్ గణేశ్ వచ్చి చూడగా, ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. ఆశయ్య బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.