మోమిన్పేట : మండల పరిధిలోని మొరంగపల్లి సమీపంలో రైలు పట్టాలపై గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్, మొరంగపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో పట్టాలపై ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు సూమరు 45 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. చామనచాయ రంగు, అతని ఒంటీపై తెలుపు రంగు చొక్కా, బుడిద రంగు ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ మర్చురీకి తరిలించినట్లు తెలిపారు. మృతుడికి సంబంధికులు ఎవరైనా ఉంటే వికాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.