వికారాబాద్ : ఎదురుగా వస్తూ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన సంఘటన నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన వెంకటేశం తన భార్య, 4నెలల పాపతో తన ద్విచక్ర వాహనంపై దసరా పండుగకు నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి వచ్చారు. శనివారం తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ పెట్రోల్ బంక్ వద్ద తంగెడుపల్లికి చెందిన టీఎస్08జిజెడ్ 2662 నంబర్గల కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకటేశం దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వెంకటేశం ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.