గాంధీనగర్ : గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. రాజ్పిపాల్ పట్ణణంలోని ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికులు తమ విధులు ముగించుకొని వ్యాన్లో స్వగ్రామం నట్రాంగ్కు బయల్దేరారు.
వందర్వెళ్లి గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న ట్రక్కు అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో నలుగురు మహిళలేనని పోలీసు తెలిపారు. మృతులు, క్షతగాత్రులంతా భరూచ్ జిల్లాకు చెందిన వారేనని బీకే పంచానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండానే పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన ట్రక్కు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.