లక్నో: కారు కొనాలన్న ఆశతో ఒక దంపతులు తమ పసి బాబును ఒక వ్యాపారికి అమ్మేశారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక మహిళ మూడు నెలల కిందట పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే కారు కొనాలన్న ఆశతో తల్లిదండ్రులు ఆ పసి బాబును గుర్సాహైగంజ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారవేత్తకు రూ.1.5 లక్షలకు అమ్మేశారు. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కాగా, ఈ విషయాన్నిగురువారం తెలుసుకున్న బాబు తాతా అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పసిబిడ్డ పేరెంట్స్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బాబును ఎవరికి అమ్మారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.