ఈనెల 13న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి విచ్చేయాలంటూ ఆలయ పాలకమండలి చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో అన్నపూర్ణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు ఆహ్వానపత్రిక అందజేశారు. అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలుకుతూ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. పాలకమండలి సభ్యులు నారాయణరాజు, అశోక్యాదవ్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, ఉమానాథ్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పి.కుమార్ తదితరులున్నారు.