ఢిల్లీ ,మే 6: కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందుకోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులోభాగంగానే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త ఆఫర్ ను అనౌన్స్ చేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది.
కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారితో పాటు ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ ప్రీమియంకు పరిమితమని కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీపై ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లకు అదనంగా ఇది ఒక్క విడతకు మాత్రమే వర్తింప చేస్తున్నట్లు తెలిపింది. మొదటి డోస్ తీసుకున్న వారు ఈ డిస్కౌంట్తోపాటు రివార్డ్స్ కూడా పొందవచ్చని తెలిపింది రిలయన్స్ .
కరోనా నేపథ్యంలో ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఉచిత రైడ్స్ను అందిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సీన్ కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ వ్యాక్సీన్ కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ.300 విలువైన రైడ్స్ పై రూ.150, డౌన్ రూ.150 వరకు పొందవచ్చని ఉబెర్ పేర్కొన్నది. ఇప్పటికే ఆఫర్లకు అర్హులైన తమ కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని కూడా పంపించింది.