లక్నో : యూపీలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో డాక్టర్ను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన సీతాపూర్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. నిందితుడు నేరుగా క్లినిక్లోకి చొరబడి సంచీలో దాచిన కత్తిని బయటకు తీసి వైద్యుడిపై దాడి చేశారు. హత్య ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు అచ్చేలాల్ను అరెస్ట్ చేశారు.
పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న బాధితుడి దవాఖానలోకి చొరబడిన నిందితుడు డాక్టర్ మునేంద్ర వర్మపై కత్తితో దాడికి తెగబడ్డాడు. డాక్టర్ మరణించిన అనంతరం నిందితుడు మృతదేహం నుంచి తల, చేతులు, కాళ్లను విడదీసి వాటిని ముక్కలు ముక్కలుగా కోశాడు. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ వర్మ తండరి గజోధర్ ప్రసాద్ తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించగా నిందితుడు అతడిపైనా దాడికి తెగబడ్డాడు. నిందితుడికి చెందిన స్థలంలో డాక్టర్ వర్మ క్లినిక్ నిర్మించినట్టు సమచారం.