జనగామ : సైకిల్ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని నర్మెట మండలం వెల్దండ గ్రామానికి చెందిన చెందిన కల్యాణం ఉప్పలయ్య(50) ఆదివారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రజినీకాంత్ జనగామ నుంచి వస్తూ వెనుక నుంచి ఉప్పలయ్య సైకిల్ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఉప్పలయ్యను జనగామ జిల్లా దవాఖనకు తరలించారు. కాగా, ఉప్పలయ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్