న్యూఢిల్లీ : భారత మార్కెట్లో బొలెరో నియోను మహీంద్రా లాంఛ్ చేసింది. గత ఏడాది బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి అమ్మకాలు నిలిచిపోయిన టీయూవీ 300 ఫేస్లిఫ్ట్ వెర్షన్గా బొలెరో నియో ముందుకొచ్చింది. బీఎస్4 నుంచి బీఎస్6 అప్గ్రేడ్లో ఎలాంటి కీలక మార్పులూ చేపట్టని మహీంద్రా తాజా మోడల్లో టీయూవీ 300ని మించి ఆధునిక ఫీచర్లని జోడించింది. ఈ ఎస్యూవీకి నూతన గుర్తింపును ఇచ్చేలా కొత్త పేరుతో ముందుకువచ్చింది.
ఈ ఎస్యూవీలో ఎలాంటి మెకానికల్ మార్పులు చేపట్టలేదని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ విజయ్ నక్రా వెల్లడించారు. గ్రామీణ రోడ్లపై రెండు దశాబ్ధాలకు పైగా బొలెరో బ్రాండ్కు విశేషమైన ఆదరణ, విశ్వసనీయత ఉన్నాయని తాజా మోడల్తో బ్రాండ్ బొలెరో మరింత ఆధునికతను సంతరించుకుందని చెప్పారు. డిజైన్, సామర్ధ్యం, ఇంజనీరింగ్ మెరుగుదలతో న్యూ బొలెరో నియో యువ కస్టమర్లను ఆకట్టుకుందని తెలిపారు. ఈ ఎస్యూవీ ఎక్స్ షోరూం ధర రూ 8.48 లక్షలు.