టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న ఎండీ జబ్బర్ పై సోమవారం రాత్రి 8గంటల సమయంలో తిరులపల్లి సమీపంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలో జబ్బర్ తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.