కాచిగూడ : పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారాయణ రాజు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (40) గురువారం రాత్రి యాకత్పుర – ఉప్పుగూడ రైల్వేస్టేషన్ల మధ్య కందికల్ గేట్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై ఎరుపు రంగు టీషర్ట్, ఎరుపు రంగు ఫుల్ చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.6 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు పేర్కొన్నారు.