కాచిగూడ : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (35) కాచిగూడలోని హైదరాబాద్ బిర్యానీ సెంటర్ సమీపంలో గల ఫుట్పాత్పై అనారోగ్యంతో సోమవారం మృతి చెంది ఉన్నాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై నీలి రంగు చొక్క,బుడిద రంగు బెడ్షీట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం 8333900128లో సంప్రదించాలని కోరారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.