మెహిదీపట్నం:అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వద్ద మంగళవారం విద్యుత్ షాక్తో ఓ సెంట్రింగ్ కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెహిదీపట్నం లక్ష్మీనగర్ చౌరస్తా సమీపంలోని పద్మనాభనగర్ ప్రధాన రోడ్డులో సౌమ్య హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ను ఆనుకుని మాజీద్ అనే వ్యక్తి భవనాన్ని నిర్మిస్తున్నాడు. సెల్లార్తో పాటు మొత్తం ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు.
మంగళవారం ఉదయం భవనం ముందు సెంట్రింగ్ కార్మికులు ఇనుప రాడ్లను కోస్తుండగా భవనం ముందు నుంచి వెళ్తున్న కరెంట్వైర్లకు ఇనుప రాడ్ తగిలి విద్యుత్ షాక్తో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు . ఇది గమనించిన స్థానికులు గాయాలకు గురైన కార్మికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా భవనం నిర్మించడమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా కరెంట్ వైర్ల సమీపంలో పనులు చేస్తున్న భవన యజమానిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని పద్మనాభనగర్కాలనీ వాసులు కోరుతున్నారు.