యాదాద్రి భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం రిజర్వాయర్లో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఇద్దరు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం రిజర్వాయర్ వద్ద చెప్పులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువకులను లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14)గా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.