Crime
- Jan 01, 2021 , 07:33:53
కొత్త సంవత్సరం వేళ ఆ ఇంట్లో విషాదం

వరంగల్: అంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిన వేళ ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. దోస్తు పుట్టినరోజు అని ఇంట్లోనుంచి వెళ్లిన యువకులు అనంతలోకాలకు చేరుకున్నారు. నూతన ఏడాది ముంగిట ఈ దుర్ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట నీలగిరిస్వామితాండ వద్ద ఓ బైకు చెట్టును ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి బంధువులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఐత శ్రీకాంత్ (20), శ్రీశాంత్ (19) మృతిచెందగా, బాలుడు రేవంత్ గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వర్ధన్నపేటలో స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
- ఆయన సేవ.. మరొకరికి తోవ..
- లీజుకు పది హరిత హోటళ్లు
- భార్యను చంపిన కేసులో ఏడేండ్ల జైలు
- బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
MOST READ
TRENDING