నష్ట పరిహారంపై కుదిరిన ఒప్పందం
కైరో, జూలై 5: మార్చిలో సూయజ్లో చిక్కుకుపోయిన జపాన్ నౌక ఎవర్ గివెన్ విడుదలకు మార్గం సుగమమైంది. నష్టపరిహారం ఇవ్వనిదే నౌకను ప్రయాణానికి అనుమతించబోమని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్సీఎ) స్పష్టం చేయడంతో ఇన్నాళ్లు ఎవర్గివెన్ అక్కడే ఉండిపోయింది. అయితే నష్టపరిహారం చెల్లింపుపై నౌకా యాజమాన్య సంస్థ, బీమా సంస్థల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదరడంతో దాని ప్రయాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. వారం రోజుల పాటు సూయజ్ కెనాల్లో నౌక చిక్కుకుపోవడంతో సుమారు రూ. 70 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, పరిహారంగా తమకు 916 మిలియన్ల అమెరికన్ డాలర్లను చెల్లించాలని ఎస్సీఎ దావా వేసింది.