మంచిర్యాల : జిల్లాలోని తాండూరు మండలం మాదారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మాదారం శివారులోని నీటికుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులను దూడం సతీశ్(21), ఆర్జి వాసు(18) గా గుర్తించారు. యువకులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.