కామారెడ్డి : సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పట్లోల్ల రామకృష్ణ, పట్లోల్ల సాయిలు ఇద్దరు అన్నదమ్ములు. వీరి కుమారులు శ్రీకాంత్ (15), సంతోష్(17) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామంలోని కోటకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.
చేపలు పడుతుండగా కాలుజారి కుంటలో పడ్డారు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మృతులు శ్రీకాంత్ 9, సంతోష్ 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముక్నునాయి. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వాన
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు