మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని బురదగూడెం గ్రామానికి చెందిన పుట్టగంటి రామారావు తన ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ ఏకే. మహేందర్, మందమర్రి సీఐ ప్రమోద్రావు సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
దాడుల్లో రూ. 5 లక్షల విలువ చేసే రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. నిందితుడు రామారావుతో పాటు నకిలీ విత్తనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం