బ్రిస్టల్: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్స్లు) టెస్టు అరంగేట్రంలో సత్తాచాటింది. షెఫాలీతో స్మృతి మంధాన (78) రాణించడంతో రెండో రోజు ముగిసే సరికి భారత్ 5 వికెట్లకు187 పరుగులు చేసింది. క్రీజులో హర్మన్ప్రీత్ కౌర్ (4), దీప్తి శర్మ (0) ఉండగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ 209 పరుగుల దూరంలో ఉంది. శిఖా పాండే (0) కెప్టెన్ మిథాలీరాజ్ (2), పూనమ్ రౌత్ (2) విఫలమయ్యారు. అంతకుముందు 269/6 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 9 వికెట్లకు 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది.