తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతాలో ఉన్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం నీమమ్. ఆ స్థానం నుంచి ఎంపీ శశీథరూర్ను పోటీ చేయించాలని.. రాహుల్ గాంధీ భావించినట్లు తెలుస్తోంది. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో .. బీజేపీ ఖాతాలో ఉన్న సీటు నుంచి శశిని పోటీ నిలబెట్టాలని రాహుల్ అనుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నీమమ్ స్థానాన్ని కైవసం చేసుకుంటే అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంకేతాలు వెళ్తాయని రాహుల్ భావించినట్లు సమాచారం. కానీ కేరళకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ అభిప్రాయం పట్ల సుముఖంగా లేరు. బీజేపీ పేరుమీదున్న నీమమ్ స్థానం నుంచి ఓమన్ చాండీ లేదా రమేశ్ చన్నితలను కూడా దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీమమ్ నుంచి శశీథరూర్ను పోటీలోకి దించినంత మాత్రాన .. కాంగ్రెస్ భవిష్యత్తు అప్పుడే మారిపోదని మరికొంత మంది సీనియర్లు అంటున్నారు. నిజానికి గత కొన్నేళ్లుగా కేరళ కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాబల్యం తగ్గుతోంది. రెండు రోజుల క్రితమే సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలంటే.. నీమమ్ స్థానం నుంచి శశిథరూర్ను రంగంలోకి దింపాలని రాహుల్ భావించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే తుది నిర్ణయం వెలుబడనున్నది.