హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపైనా దృష్టిపెట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని కొవిడ్ కంట్రోల్రూంల ఇంచార్జిలు, అడిషనల్ ఎస్పీలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే మొదటి రోజు నుంచే చికిత్స అం దించాలని సూచించారు. వారికి ప్రత్యేక ఐసొలేషన్ గదులను ఏర్పాటుచేయాలని, బలవర్ధక ఆహారం అందించాలని డీజీపీ ఆదేశించారు. అత్యవసర పరిస్థితి వస్తే దవాఖానలో చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.