సూరత్లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి

హైదరాబాద్: గుజరాత్లోని సూరత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాది నదీ జలాల కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు గుజరాత్ వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును సూరత్ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అడిక్మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్బజార్ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమణ అక్కడిక్కడే మరణించారు. ఈవో సత్యనారణ, పూజారి వేంకటేశ్వర శర్మ, క్లర్క్ కేశవరెడ్డి గాయపడ్డారు. పోలీసులు వారిని అహ్మదాబాద్లోని హోప్ దవాఖానకు తరలించారు.
కాగా, ఈ ప్రమాద ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేశాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ను ఆదేశించారు.
తాజావార్తలు
- భారీ ఆఫర్కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’